Wednesday, January 18, 2012

తెలుగు ఆణిముత్యాలు - స్వాతంత్ర్య పోరాట వీరులు : ఆదివాసీల పోరుబిడ్డ కొమరం భీమ్!


కొమురం భీమ్ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు. పశువుల కాపర్లపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా ఉద్యమించి వీరమరణం పొందాడు.
భారతదేశంలో ఆదివాసీల హక్కుల కోసం జరిగిన పోరాటాలు చరిత్రాత్మక మైనవి. ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీ, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన కొమరం భీమ్ ‘జల్-జంగిల్-జమీన్’ నినాదానికి ప్రతీకగా నిలిచిపోయూడు. కొండ కోనల్లో, ప్రకృతితో సహ జీవనం సాగించే ఆదివాసీ ప్రజలకు అడవిపై హక్కు సావూజిక న్యాయుంలో భాగవుని నిన దిస్తూ, 1928 నుంచి 1940 వరకూ రణభేరి మోగించిన కొమరం భీమ్ నైజాం సర్కార్ గుండెల్లో సింహ స్వప్నంగా వూరిన పోరాటయోధుడు. గిరిజన గోండు తెగకు చెందిన కొమరం చిన్నూ-సోంబారు దంపతులకు ఆదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ తాలూకాలోని సంకేపల్లి గ్రావుంలో కొమరం భీమ్ 1900 సంవత్సరంలో జన్మించాడు.
  
ఉద్యమ జీవితం
పదిహేనేళ్ల వయుసులో అటవీశాఖ సిబ్బంది జరిపిన దాడిలో తండ్రి వురణించగా, కొమరం కుటుంబం కరిమెర ప్రాంతంలోని సర్ధాపూర్‌కు వలస వెళ్లింది. అక్కడ కూడా కొమరం కుటుంబం ప్రశాంతంగా జీవించడం సాధ్యం కాలేదు. సిద్ధిఖీ అన్న జాగీర్‌దార్ కొమరం సాగు చేస్తున్న భూమిని ఆక్రమించడంతో, పట్టరాని కోపంతో సిద్ధిఖీని హతవూర్చి బల్హార్ష మీదుగా అస్సాం చేరుకుని ఐదేళ్లపాటు అక్కడే గడిపాడు. అక్కడి కాఫీ, తేయూకు తోటల్లో పనిచేస్తూ గడించిన రాజకీయు పోరాట అనుభవంతో వుళ్లీ కరిమెర చేరుకున్నాడు. నిజాం నవాబు ఆదివాసులపై ఆ రోజుల్లో అడవిలో పశువులు మేపుకున్నందుకూ, వంటచెరకు తెచ్చుకున్నందకూ పన్నులు వసూలు చేసేవాడు. తవు జాతి స్వేచ్ఛా స్వాతంత్య్రాలపై నిజాం ఆగడాలను ప్రశ్నిస్తూ కొమరం గంభీరంగా సాగించే ప్రసంగాలు ఆదివాసీలను పోరాట సింహాలుగా వూర్చారు. ఆసిఫాబాద్ పరిసర ప్రాంతాలు గెరిల్లా పోరాట కేంద్రాలుగా మారారు. జోడేఘాట్ గుట్టలు పోరాట జ్వాలలను రగిలించారు. కుర్దు పటేల్ అనే నమ్మకద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం సైన్యం 1940 సెప్టెంబర్ 1 న జోడేఘాట్ అడవుల్లోని కొమురం భీమ్ స్థావరాన్ని ముట్టడించి భీమ్ ని హతమార్చాయి. అది గిరిజనులు పవిత్రంగా భావించే ఆశ్వీయుజ శుద్ద పౌర్ణమి కావడంతో అప్పటి నుండి ఆ తిధి రోజునే ఆదివాసీలు కొమురం భీమ్ వర్ధంతిని జరుపుకొంటూ వస్తున్నారు.

 http://te.wikipedia.org/wiki and sakshi news paper

 కొమరం భీమ్ కధ (సినిమాను అనుసరించి)

 ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ ప్రాంతంలో అడవిలో నివసించే గోండులను నిజాం ప్రభుత్వ అధికారులు బాగా దోచుకుంటుంటారు. వారి నుండి అనేక పన్నులు వసూలు చేస్తూ, వారి గూడేలపైబడి అనేక విధాలుగా హింసిస్తూ ఉంటారు. ఒక సారి కొమరం భీం ఉండే గ్రామ పట్వారీ (Village Secretary) వచ్చి “మీరు అడవిని కొట్టి భూముని చదును చేస్కుంటే మీకు నిజాం ప్రభుత్వం పట్టాలు ఇస్తుందని చెబుతాడు. అది నమ్మి ఆ గోండులు కొంత భూమిని చదును చేసి సాగుచేసుకోవడం మొదలుపెడతారు. తీరా భూమిని దున్నే సమయానికి పట్వారీ దాన్ని కాజేసే ఉపాయం చేస్తాడు. ఆ భూములన్నీ ప్రభుత్వం ఒక ఆసామికి పట్టా చేయమని ఉత్తర్వులు ఇచ్చిందని గోండులు ఆ భూమిని ఖాళీ చేయాలని చెబుతాడు.

ఈ అన్యాయాన్ని ప్రశ్నించిన గోండు నాయకుడిని చర్చలకు అని పిలిపించి ఆహారంలో విషం ఇచ్చి చంపుతాడు పట్వారి. జరిగిన మోసం అర్థం చేసుకున్న కొమరం భీం ప్రభుత్వాధికారులపైకి తిరగబడతాడు. అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు దగ్గరి నుండి తుపాకీ గుంజుకుని సాయుధుడవుతాడు. తోటి గోండులకు జరుగుతున్న మోసాలపై తిరగబడమని చెబుతాడు.

భీం చేస్తున్న పొరాటం గురించి తెలుసుకున్న పై అధికారులు కలవరపడతారు. భీం ను బంధించడానికి ఇంకొంతమంది పోలీసులను పంపుతారు. భీంపై కేసులు పెడతారు. సమీపంలోని టౌన్లో ఉన్న న్యాయవాదిని కలుస్తాడు భీం. “నువ్వు గూడెంలో ఉంటే పోలీసులు గూడెంపై బడతారు. నువ్వు అడవిలోకి పారిపోతే, పోలీసులు నీ వెంట బడతారు, గూడెం ప్రశాంతంగా ఉంటుంది” అన్న ఆ న్యాయవాది సలహా మేరకు భీం అజ్ఞాతంలోకి వెళతాడు. అక్కడే సోం బాయిని వివాహం చేసుకుంటాడు.

కొంత కాలానికి గూడేనికి తిరిగివచ్చిన భీం గోండులను సమావేశపరచి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిస్తాడు.

ప్రాణాలకు తెగించి ఈ పోరాటం ఎందుకు చేయాలన్న భార్య ప్రశ్నకు బదులిస్తూ…
గెలిస్తే మనం తలెత్తుకుని తిరుగుతామని, ఓడిపోయి మరణిస్తే మన పిల్లలు తలెత్తుకుని తిరుగుతారని చెబుతాడు భీం.

భీం తిరుగుబాటును అణచివేయడానికి అసిఫాబాదుకు ఒక కొత్త అవ్వల్ తాలుఖ్దార్ (District Collector) ను పంపిస్తుంది నిజాం ప్రభుత్వం. భీం న్యాయవాది ద్వారా “పోరాటం విరమిస్తే 30 ఎకరాల భూమిని నజరానాగా ఇస్తానని” కబురు పంపుతాడు అవ్వల్ తాలుఖ్దార్.

కానీ భీం ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. అడవిలోని గోండులందరికి 30 ఎకరాల భూమి ఇస్తుందా ప్రభుత్వం అని ప్రశ్నిస్తాడు.

చివరికి జోడేఘాట్ కొండపైకి పెద్ద ఎత్తున బలగాలను తీసుకుని దండయాత్రకు బయలుదేరుతాడు అవ్వల్ తాలుఖ్దార్. ఉన్న కొద్దిపాటి ఆయుధ సంపత్తితో పోలీసులను మొదటి రోజు నిలువరించగలుగుతాడు భీం. అయితే ఆ రోజు రాత్రి ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో జోడేఘాట్ ను వెనుకవైపునుండి చుట్టుముట్టిన నిజాం పోలీసులు భీం గోండు సైన్యంపై దొంగదెబ్బ తీస్తారు.

సూర్యోదయం అవుతుండగా పోలీసు బుల్లెట్లకు కొమరం భీం నేలకొరుగుతాడు.

No comments:

Post a Comment