ఎన్డీసీలో రాజకీయ దుమారం
రాజకీయాలకు అతీతంగా వెనకబడిన ప్రాంతాలను త్వరితగతిన అభివృద్ధి చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి చెప్పారు. 11వ ప్రణాళికలో వృద్ధి లక్ష్యాలను సాధించలేదన్నారు. అభివృద్ధిలో సమతుల్యత అవసరమని, అట్టడుగు వర్గాల్ని ప్రధాన స్రవంతిలోకి తీసుకు రావాలని మాయావతి కోరారు. ధరల నియంత్రణలో కేంద్రం వైఫల్యాన్ని ముఖ్యమంత్రులు ఎండగట్టారు. ధరలరంగంలో కేంద్రం విధానాలు విఫలమయ్యాయని మోడీ అన్నారు.
రాష్ట్రాల ప్రణాళిక వాటా ఆధారంగా కేంద్ర ప్రణాళికలో బడ్జెట్ బలపడుతోందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ అన్నారు. కేంద్రం అభివృద్ధి విధానం ప్రాంతాలమధ్య అంతరాల్ని పెంచుతోందని త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆరోపించారు. కేంద్రం జాతీయ పథకాల్లో తమపట్ల వివక్ష ప్రదర్శిస్తోందని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్సింగ్ బాదల్ ఆందోళన వ్యక్తం చేశారు.
http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=3&ContentId=53445
No comments:
Post a Comment